Bhagavad Gita: Chapter 8, Verse 5

అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరమ్ ।
యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః ।। 5 ।।

అంత-కాలే — మరణ సమయంలో; చ — మరియు; మామ్ — నన్ను; ఏవ — మాత్రమే; స్మరన్ — స్మరిస్తూ; ముక్త్వా — విడిచిపెట్టుట; కలేవరమ్ — శరీరము; యః — ఎవరైతే; ప్రయాతి — వెళ్ళునో; సః — అతడు; మత్-భావం — భగవత్ స్వభావము; యాతి — పొందును; న అస్తి — లేదు; అత్ర — ఈ విషయంలో; సంశయః — సందేహము.

Translation

BG 8.5: మరణ సమయంలో నన్ను స్మరిస్తూ దేహాన్ని విడిచిపెట్టిన వాడు నన్నే చేరుకుంటాడు. ఈ విషయంలో ఎలాంటి సందేహానికి తావు లేదు.

Commentary

తదుపరి శ్లోకంలో, శ్రీ కృష్ణుడు ఏమంటాడంటే, ఒక వ్యక్తి యొక్క తదుపరి జన్మ ఆ వ్యక్తి మరణ సమయంలో అతని యొక్క అంతఃకరణ స్థితిని బట్టి మరియు వ్యక్తికి దేనిపై మనస్సు ఉంది అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది, అని పేర్కొంటాడు. కాబట్టి మరణ సమయంలో ఎవరైనా - భగవంతుని అలౌకిక నామాలు, గుణములు, రూపములు, లీలలు, మరియు ధామములు - వీటిపై నిమగ్నమై ఉంటే, భగవత్ ప్రాప్తి లక్ష్యం పొందుతాడు. శ్రీ కృష్ణుడు ఇక్కడ 'మద్ భావం' అన్న పదం వాడుతున్నాడు, అంటే ‘భగవంతుని వంటి స్వభావము’. ఈ విధంగా, మృత్యు సమయంలో, వ్యక్తి అంతర్గత దృక్పథం భగవంతుని యందే నిమగ్నమై ఉంటే, అతను భగవంతుడినే పొందుతాడు, మరియు స్వభావములో భగవంతుని లాగానే అవుతాడు.